ఎరువులు:
సీతాఫలం చెట్టు ఎరువులకు బాగా ప్రతిస్పందించి మంచి దిగుబడులనిస్తుంది. 50 కి పశువులు ఎరువు, 1 కి. ఆముదపు పిండి , 1 కి ఎముకల పొడిని ఒక చెట్టు పాదులో ఒకసారి జూన్ -జులైలో వేసుకోవాలి. 250 గ్రా. నత్రజని(500 గ్రా యూరియా) 125 గ్రా. భాస్వరం (700 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్పేట్), 125 గ్రా. పొటాష్(200 గ్రా.మ్యూరేట్ ఆఫ్ పొటాష్) చెట్టు పాదుల్లో తేమవున్నపుడు రెండు దఫాలుగా వేసుకోవాలి(జూన్-జూలై),(ఆగష్టు-సెప్టెంబరు). జీవన ఎరువైన అజటోబ్యా ర్ ను చెట్టుకి 250 గ్రా. వరకు వేసుకోవటం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చు.